జమ్మూకశ్మీర్:
అమర్నాథ్ యాత్రలో మరో అపశృతి చోటు చేసుకుంది. కొండపై నుంచి బండరాళ్లు దొర్లిపడటంతో ఓ మహిళా యాత్రికురాలు చనిపోయింది. శేర్లింగంపల్లికి చెందిన పులిచెర్ల లక్ష్మి అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. యాత్ర చేస్తుండగా అకస్మాత్తుగా వచ్చిన బండరాయి లక్ష్మిని ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.