న్యూఢిల్లీ:
ఆవులను స్మగ్లింగ్ చేసే వారు పట్టుబడితే మూడు చెంపదెబ్బలు కొట్టి చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్దేవ్ అహుజా అన్నారు. అల్వార్లో ఆవును తరలిస్తున్నారనే అనుమానంతో రక్బర్ ఖాన్ అనే వ్యక్తి మూక హత్యకు గురైన నేపథ్యంలో ఘటనా ప్రాంతాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని తాను ప్రజలను కోరుతున్నానన్నారు. గోవులను తరలించేవారని విపరీతంగా కొట్టే బదులు రెండు మూడు దెబ్బలు తగిలించాక వారిని పారిపోనీయకుండా చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నదే తన ఉద్దేశమని చెప్పుకొచ్చారు.