ప్రభుత్వం అండగా ఉంటుంది.
అటవీ సిబ్బందికి మంత్రి అల్లోల భరోస!!
హైదరాబాద్:
అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు. సోమవారం సచివాలయంలో అటవీశాఖ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రతినిదులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అటవీ ఉద్యోగులపై జరిగిన దాడుల్లో నిందితులను సత్వరం శిక్షించడానికి ఫాస్ట్ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని, నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…కొత్త సర్సాల ఘటన దురదృష్టకరమని, విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులు, ఓ మహిళ ఉద్యోగిని పై దాడి చేయడం గర్హనీయం అన్నారు. సార్సాల దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, దాడికి పాల్పడినవారిని అరెస్టు కూడా చేయడం జరిగిందన్నారు. అటవీ శాఖ అధికారు ఆత్మ స్థైరాన్ని కొల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు.
Attachments area