Hyderabad:
టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతున్నట్లుఆయన ప్రకటించాడు. ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడంతో మనస్తాపం చెందిన రాయుడు.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాయుడుకు బదులు జట్టులో స్థానం సంపాదించుకున్న విజయ్ శంకర్ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. అతడి స్థానంలో మయాంక్ అగర్వాల్ను జట్టులోకి తీసుకున్నారు. రెండో సారీ అవకాశం రాలేదన్న నిరాశతోఅంబటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీమిండియా ప్రపంచకప్ జట్టులో స్టాండ్ బైలో ఉన్నప్పటికీ రాయుడికి అవకాశం రాలేదు. క్రికెట్ కెరీర్లో 55 వన్డేలు ఆడిన రాయుడు 47.05 సగటుతో 1,694 పరుగులు చేశాడు. వన్డేల్లో మూడు సెంచరీలు, పది హాఫ్ సెంచరీలున్నాయి. 216 టీ 20ల్లో 4,584 పరుగులు సాధించాడు. టీ20ల్లో ఒక శతకం, 24 అర్ధశతకాలు రాయుడు చేశాడు. చివరిగా ఐపీఎల్ -2019లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 17 మ్యాచుల్లో 282 పరుగులు చేశాడు.