సింగరేణిఎన్నికల నుంచి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో సీన్ పూర్తిగా మారిపోయింది.సింగరేణికాలరీసుకార్మిక సంఘం ఎన్నికల్లో కొత్తగూడెం ప్రాంతాల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయానికి ఎం.పి.విశేషంగాకృషి చేసినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.ఇక ఆ తర్వాత ఎం.పి.కొత్తగూడెంలో స్వైరవిహారంచేస్తున్నారు.తనకంటూ ఒక బలమైన గ్రూపును,అనుచరగణాన్ని ఇప్పటికే ఆయన తయారు చేసుకున్నారు.స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండాకొత్తగూడెంనియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకార్యక్రమాలునిర్వహిస్తున్నారు.పార్టీలోచేరికలు,పరామర్శలు చేస్తూ ఎంపి సొంత బలంపెంచుకుంటున్నారు.ఇటీవల రంజాన్ పండుగ కు ముందు కొత్తగూడెం క్లబ్ లోఎం.పి.భారీగా ఇఫ్తార్ విందు ఇవ్వడం కూడా చర్చకు దారి తీసింది.వివాదాస్పదమవుతున్నది. జలగంవెంకటరావుకువ్యతిరేకులుగాముద్రపడిననాయకులు,జలగం వెంకటరావు వ్యవహారశైలి పట్ల అసంతృప్తిగా ఉన్నవ్యక్తులు,పాతటీఆర్ఎస్లీడర్లంతాఎంపిపక్కన చేరుతున్నారు
భద్రాద్రికొత్తగూడెం;
ఖమ్మం లోక్ సభ సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొత్తగూడెం శాసన సభ్యుడు జలగం వెంకటరావు ల మధ్య వర్గపోరు ఉదృత రూపం దాల్చుతున్నది.ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నది.ఈవిషయమై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్,మంత్రికేటీఆర్దగ్గర కూడా ‘పంచాయితీ’జరిగినట్టురాజకీయవర్గాల్లోప్రచారంజరుగుతోంది.పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి ఈ సారి కొత్తగూడెం అసెంబ్లీ సీటుపై కన్నేయడమే ఇందుకు కారణం. కానీసింగరేణిఎన్నికల నుంచి కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో సీన్ పూర్తిగా మారిపోయింది.సింగరేణికాలరీసుకార్మిక సంఘం ఎన్నికల్లో కొత్తగూడెం ప్రాంతాల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం విజయానికి ఎం.పి.విశేషంగాకృషి చేసినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర మంచి మార్కులు కొట్టేశారు.ఇక ఆ తర్వాత ఎం.పి.కొత్తగూడెంలో స్వైరవిహారంచేస్తున్నారు.తనకంటూ ఒక బలమైన గ్రూపును, అనుచరగణాన్ని ఇప్పటికే ఆయన తయారు చేసుకున్నారు.స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండాకొత్తగూడెంనియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకార్యక్రమాలునిర్వహిస్తున్నారు.పార్టీలోచేరికలు, పరామర్శలు చేస్తూ ఎంపి సొంత బలంపెంచుకుంటున్నారు.ఇటీవల రంజాన్ పండుగ కు ముందు కొత్తగూడెం క్లబ్ లోఎం.పి. భారీగా ఇఫ్తార్ విందు ఇవ్వడం కూడా చర్చకు దారి తీసింది.వివాదాస్పదమవుతున్నది.జలగంవెంకటరావుకువ్యతిరేకులుగాముద్రపడిననాయకులు, జలగం వెంకటరావు వ్యవహారశైలి పట్ల అసంతృప్తిగా ఉన్నవ్యక్తులు,పాతటీఆర్ఎస్లీడర్లంతాఎంపిపక్కనచేరుతున్నారు.వారు శాసనసభ్యుడు జలగం కు వ్యతిరేకంగాబహిరంగానే మాట్లాడుతున్నారు. కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్ర సమితిలోని ఆధిపత్య పోరును బహిర్గతపరుస్తోంది. 2019లో పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనిఇంటిపెండెంట్ గా పోటీ చేసినా గెలిచేంతసత్తాపొంగులేటిశ్రీనివాస్ రెడ్డికి ఉందనిఎంపిసన్నిహితులుచెబుతున్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచిగులాబి జెండా ఎగురవేసినఏకైకఎం.ఎల్.ఏ. జలగం వెంకటరావు.ఇటుకమ్యూనిస్టుపార్టీలు, అటుకాంగ్రెస్ నాయకులు బలంగా ఉన్నప్పటికీకొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ గెలుపొందడం అప్పట్లో సంచలనం. కానీ ప్రస్తుతపరిస్థితుల్లోఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న అదే కొత్తగూడెం సీటుకు ఎసరొచ్చినట్టుకనిపిస్తోంది. అది కూడా సొంతపార్టీ నుంచి నేతల నుంచే ముప్పుపొంచిఉన్దట్టు చెప్పుకుంటున్నారు. వెంకట్రావుకొత్తగూడెం నుంచి మరోచోటకువలసపోతారని మొదట్లోప్రచారంజరిగింది. కొత్తగూడెం అసెంబ్లీ సీటులో అభ్యర్థినిమారుస్తారని కూడా ప్రచారంసాగుతున్నది. కొత్తగూడెంలోఎం.ఎల్.ఏ జలగం వెంకటరావు సాధారణంగాప్రజలకు,సింగరేణికార్మికుకు అందుబాటులో ఉండరన్న అపవాదు ఉన్నది.సమస్యలనువాట్సప్ ద్వారా , ఎస్.ఎం.ఎస్ ద్వారా పంపమని ప్రజల్ని కోరతారని,మెయిల్ ద్వారా సంప్రదింపులుజరపాలని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెట్టిన బోర్డు కూడా ఆయనపై‘నెగిటివ్ చర్చ’కు కారణమైంది.కొత్తగూడెంలోఆయనఅంతరంగీకులుగా చెలామణి అవుతున్న ‘ఇద్దరునాయకులు’ పెత్తనం చేస్తున్నట్టువిమర్శలు వస్తున్నవి. ‘షాడో ఎమ్మెల్యే’ గా చెలామణి అయ్యే ఒక నాయకునివల్ల కూడా జలగంఅప్రదిష్టపాలవుతున్నట్టు పార్టీ వర్గాలసమాచారం. ఇంటిలీజెన్స్సర్వే చూసినా, పార్టీ సర్వే రిపోర్టు ప్రకారం చూసినాజలగంకుకొత్తగూడెంలోగండం ఉన్నట్టు తెలియవచ్చింది. దీంతో ఎంపిపొంగులేటిశ్రీనివాస్ రెడ్డి మరింత దూకుడు పెంచినట్టుకనిపిస్తోంది. కార్మిక వర్గాలు, ముస్లింలు, ఇతరవర్గాల్లోపట్టు సంపాదించేందుకు సందర్భానుసారంఎంపిపర్యటనలు చేస్తున్నారు. దీంతో జలగంవెంకటరావు తనటికెట్టు భద్రత కోసం నానా హైరానా పడుతున్నట్టుతెలుస్తున్నది.