చిత్తూరు:
చిత్తూరు జిల్లా కురబలకోట లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న అయిచర్ వాహనాన్ని వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదం లో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. సంఘటనా స్థలానికి మదనపల్లె గ్రామీణ పోలీసులు చేరుకున్నారు. మృతులంతా కురబల్ కోట చెందిన వారి గా గుర్తింపు. మృతదేహాలు మదనపల్లె ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.